మొన్నటి వరకు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి నాగబాబు మరియు రోజా పోస్ట్లుగా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు గానీ నాగబాబు మొదట ఈ షో నుండి వెళ్లిపోవడం జరిగింది. దాని అనంతరం కొద్ది రోజుల తర్వాత రోజా కూడా ఈ షో నుండి తప్పుకుంది. ప్రస్తుతం రోజా అటు రాజకీయాలుతో బిజీగా ఉంది. వాటితో పాటు పలు షో ల లో  కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ అలరిస్తోంది రోజా. అయితే తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అది ఏంటి అంటే నాగబాబుకి మరియు రోజాకి ఇద్దరు మధ్య ఏవో విభేదాలు వచ్చిన కారణంగా వీరిద్దరూ జబర్దస్త్ షో నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈ వార్తపై స్పందించింది రోజా. ఇక అప్పట్లో హీరోయిన్గా నటించిన అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీని దక్కించుకుంది రోజా. అంతే కాకుండా అప్పట్లో ఫైర్ బ్రాండ్ గా కూడా మంచి గుర్తింపును పొందింది రోజా. అయితే నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్న అనంతరం కొద్ది రోజులకే రోజా కూడా తప్పుకోవడంతో రోజా కూడా ఎందుకు జబర్దస్త్ నుండి తప్పుకుంది అని అనుమానాలు రేకెత్తాయి.

దీనికిగాను వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది.అయితే ఈ విషయమై రోజా మాట్లాడుతూ నాగబాబు గారు జబర్దస్త్ షో నుండి తప్పుకోవడానికి కారణం నేను కాదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. దానికి సంబంధించిన ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి .అది ఆయన ఇష్టం. నాగబాబు గారు నాతో ఎప్పుడూ చాలా క్లోజ్ గా ఉంటారు .చాలా పాజిటివ్ గా మాట్లాడతారు. ఇక ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్ల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ నువ్వు అని నాగబాబు గారు చాలా సార్లు నాతో అనడం కూడా జరిగింది  ఎందుకు అంటే ముగ్గురు మొనగాళ్లు సినిమా టైంలో ఆయనేంటో నాకు అర్థమైంది. నేను ఏంటో నాగబాబు గారికి కూడా చాలా బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది రోజా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: