బిగ్ బాస్ సీజన్ 6 ముగిసి వారం రోజులు అవుతుంది. వచ్చింది కప్ తనకే అయినా ఇది నాదే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రేవంత్ ది అయితే.. కప్ ఏముంది 40 లక్షల క్యాష్ ప్రైజ్.. అంతకంటే ముఖ్యంగా ఆడియన్స్ ఓట్స్ ఇలా అన్ని తనకే వచ్చాయంటూ శ్రీహాన్ ఒక దాని మీద మరొకటి అనేలా పోటీ పడి మరి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో టాప్ 6 కంటెస్టంట్ గా ఎలిమినేట్ అయిన శ్రీ సత్య కూడా జాయిన్ అయ్యింది.

ఆమె ఎలిమినేషన్ అయిన వారమే టైటిల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. అందుకే శ్రీ సత్యని ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. లేటెస్ట్ గా ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో శ్రీ సత్య హౌస్ లో ఎవరు జెన్యూన్ గా లేరని సంచలన కామెంట్ చేసింది. ఆట కోసం అప్పటికప్పుడు మాట్లాడటం ఆ తర్వాత గొడవ పడటం చేస్తుంటారని అన్నది. తనది శ్రీహాన్, రేవంత్ లది మాత్రమే ఫ్రెండ్ షిప్ అని అన్నది. అయితే తను ఏదైనా ఉన్నా కూడా ఆ విషయం ఎలాంటిదైనా సరే ఎదుటి వారి మొహం మీద చెప్పేసే అలవాటు ఉంది. అందుకే అందరు తనని కావాలని టార్గెట్ చేశారని అన్నది శ్రీ సత్య.

స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న సూర్య వెళ్లాక వీకెండ్ వస్తుంది అంటే ఎవరైనా ఎలిమినేట్ అవ్వొచ్చు అని భావన వచ్చింది. అందరు ఒకానొక దశలో భయపడ్డాం అని కూడా అన్నారు శ్రీ సత్య. ఇక ఇనయా తనని, శ్రీహాన్ ని ఉద్దేశించి చేసిన కామెంట్ పై స్పందిస్తూ పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అందుకే అంటారని బదులిచ్చింది.

హౌస్ లో ఎవరు సేఫ్ ఆట ఆడుతున్నారు అన్నది అర్ధమవుతుందని.. అయితే అక్కడ చెప్పడం కుదరదని.. సీజన్ పూర్తయ్యాక నాకు అనిపించింది ఏంటంటే హౌస్ లో రాజ్, శ్రీహాన్ జెన్యూన్ గా అనిపించారని అన్నది. ఇక జెన్యూన్ గా అనిపించని వారు మాత్రం ఇనయా, కీర్తిల పేర్లు చెప్పింది శ్రీ సత్య. వారిద్దరు అనవసరమైన స్టేట్మెంట్స్ ఇస్తారు కానీ అసలు విషయం ఏంటంటే వాటిపై వారికే ఒక క్లారిటీ ఉండదని చెప్పింది శ్రీ సత్య. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో ఆట ముగిసినా బయట ఇంకా ఆ రచ్చ కొనసాగుతూనే ఉందని అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: