బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పఠాన్ దాదాపుగా మూడేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు ఈ సినిమాతో రాబోతుండడంతో అభిమానులలో భారీ అంచనాలు పెరిగాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు అరుదైన ఫీట్ ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ICE theater format లో తొలి భారతీయ సినిమాగా అరుదైన రికార్డు పఠాన్ సొంతం చేసుకోవడం విశేషం. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన బేషరమ్ రంగీ పాటలో ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హిందూ ధర్మాన్ని అవమానిస్తూ.. కాషాయపు రంగు బికినీ దుస్తులు ధరించడంతో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.

అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా అన్నీ కూడా సద్దుమణిగాయని తెలుస్తోంది.  2023 జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం అయింది.  ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన షారుక్ ఖాన్.. దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు . ముఖ్యంగా షారుక్ ఖాన్ - దీపిక పదుకొనే కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా కావడం విశేషం.

ఇప్పటికే టీజర్ విడుదలై టీజర్ కూడా విశేష స్పందన పొందింది. పఠాన్ సినిమా విడుదల ఇంకా కేవలం 30 రోజులు మాత్రమే ఉండడంతో షారుఖ్ ఖాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ కి సంబంధించిన సినిమా కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో షారుక్ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: