ఇటీవల కాలంలో సమంత తన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లేడీ ఓరియంటెడ్  సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ మంచి విజయాలను సాధిస్తుంది. ఏకంగా హీరోలకు సైతం పోటీ ఇస్తుంది హీరోయిన్ సమంత. ఇటీవలే ఇక 2022లో కూడా యశోద అనే సినిమాతో సూపర్ హిట్ సాధించింది. సమంత ప్రధానోపాత్రలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా క్రైమ్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ సినిమాలో ఎప్పటిలాగానే సమంత తన నటనతో పాత్రకు ప్రాణం పోయగా ఇక యాక్షన్స్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా నేరుగా సమంత పాల్గొని ప్రేక్షకులు అందరినీ కూడా మంత్రముగ్ధులు చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నిర్మాతలకు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే ఇలా యశోద సినిమాలో సమంత నటనకు యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చూపించిన తెగువకు అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇటీవల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 పురిటి పిల్లల ప్లాస్మాతో కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం చేయడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. చెల్లిని రక్షించే ప్రయత్నం లో అక్క రిస్క్ చేయడం.. మాఫియాను అంతమొందించడం బాగుంది. అయితే ఇందులో  సీక్రెట్ పోలీస్ ఏజెంట్గా సమంత ఎంతో బాగా నటించింది.  అయితే ఇదే సినిమా లో ఒకప్పటి హీరోయిన్ విజయ శాంతి నటించి ఉంటే మాత్రం సినిమా మరో లేవల్ లో ఉండేది. అప్పట్లో ఇటువంటి సినిమాను విజయ శాంతి చేసి ఉంటే మాత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచేదని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటి హీరోయిన్లలో సమంత ఆ పాత్రని ఎంతో అద్భుతంగా పోషించిందంటూ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: