కిరాక్ ఆర్పి.. ఇతని గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దాదాపు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా కమెడియన్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన కిరాక్ ఆర్పి తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఒక సాదాసీదా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఏకంగా టీం లీడర్ గా కూడా మారిపోయాడు. అయితే జబర్దస్త్ ఎంతోమందికి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాదు ఫైనాన్షియల్ గా కూడా మంచి లగ్జరీ లైఫ్ ను ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఇలా జబర్దస్త్ కారణంగా కెరియర్లో రాణించడమే కాదు ఫైనాన్షియల్ గా నిలదొక్కుకున్న వాళ్ళలో కిరాక్ ఆర్పి కూడా ఒకరు. నెల్లూరు యాసతో  తనదైన శైలిలో కామెడీ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక తర్వాత కాలంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో వచ్చిన చిన్న చిన్న గొడవల కారణంగా జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మాటీవీలో పలు కార్యక్రమాలలో సందడి చేశాడు అక్కడ బాగానే డబ్బులు వెనకేసుకున్నాడు. అయితే ఇటీవలే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక రెస్టారెంట్ ను ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. అన్ని రకాల చేపలు వంటకాలు ఇక ఈ రెస్టారెంట్ లో అందుబాటులో ఉంటాయని చెప్పాలి.


 ఇక రెస్టారెంట్ పెట్టిన తర్వాత కిర్రాక్ ఆర్పి కి ఊహించిన రీతిలో అదృష్టం కలిసి వచ్చింది. అతని రెస్టారెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఈ రెస్టారెంట్ కి కస్టమర్లు తరలివస్తున్నారట. అయితే జనాల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుండడంతో కొంతకాలం పాటు రెస్టారెంట్ మూసివేయాలని ఆలోచన చేస్తున్నాడట కిరాక్ ఆర్పి. కొన్ని రోజుల్లో సరికొత్త హంగులతో ఎక్కువ మంది సిబ్బందితో మరింత ఘనంగా రెస్టారెంట్ ను ప్రారంభించాలని అనుకుంటున్నాడట. ఇలా బిజినెస్ ద్వారా ప్రతిరోజు కూడా 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట కిర్రాక్ ఆర్పి. నెలకు దాదాపు మూడు కోట్ల రూపాయల సంపాదిస్తున్నాడట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rp