నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్  షో అన్ స్టాపబుల్. ఇప్పటికే మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇప్పుడు రెండవ సీజన్ కూడా చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ రెండవ సీజన్ కి రాజకీయ నాయకులు కూడా హాజరవుతూ ఉండడం గమనార్హం ఇకపోతే బుల్లితెరపై ఎప్పుడూ సందడి చేయని ప్రభాస్.. ఈసారి బాలయ్య కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి హాజరయ్యారు అంతేకాదు ప్రభాస్ ఎపిసోడ్ ను బాహుబలి పేరిట రెండు భాగాలుగా ఆహా స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ ఆఖరిన బాహుబలి పార్ట్ వన్ ఎపిసోడ్ ను  స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే.  ప్రభాస్ దెబ్బకు ఆహా కూడా కొద్దిసేపు పని చేయకుండా ఆగిపోయింది.  చాలామంది సబ్స్క్రైబర్లు పెరిగి పోయారు.

మొదటి ఎపిసోడ్ లో బాలకృష్ణ,  ప్రభాస్ మాత్రమే సందడి చేశారు.  అయితే ఇప్పుడు రెండవ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.  జనవరి 6 అంటే ఈరోజు ఆహా బాహుబలి పార్ట్ 2 ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.  ఇందుకు సంబంధించి ప్రోమోను కూడా నిన్న రిలీజ్ చేయగా ఈ ప్రోమోలో ప్రభాస్,  గోపీచంద్,  బాలకృష్ణ సందడి చేసినట్లు మనం చూడవచ్చు. ప్రభాస్ గురించి గోపీచంద్ బాలకృష్ణతో ఏదో చెప్పబోతుండగా ప్రభాస్ బెదిరించే ప్రయత్నం చేశాడు.  మధ్యలో బాలకృష్ణ అడ్డుకోవడం అన్నీ హాస్యాస్పదంగా సాగాయి. అంతేకాదు ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


నిన్న విడుదలైన ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.. కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు గోపీచంద్,  బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పెద్ద నాన్న  కృష్ణంరాజును తలుచుకొని ప్రభాస్ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే  ఈరోజు స్ట్రీమింగ్ కానున్న ఈ పార్ట్ 2 ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: