టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్కల జోడి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ సినిమాల్లో ప్రభాస్ అనుష్కల మధ్య కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరూ దాసోహం అయిపోయారు. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసి బయట కూడా నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ ఈ జంట పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ చాలాకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అభిమానులు సైతం ఇదే చూడాలనుకున్నారు. కానీ ప్రభాస్ అనుష్క మాత్రం అలాంటిదేమీ లేదని,తాము మంచి స్నేహితులమని చెబుతూ ఉంటారు.

అయినా కూడా వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారనే వార్తలకు పులిస్టాప్ పడలేదు. అయితే ప్రభాస్ అనుష్కల డేటింగ్ నిజమేనట. తాజాగా ఈ విషయం బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో బయటపడింది. ఆహా టీం ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు. అందులో మొదటి భాగం న్యూ ఇయర్ సందర్భంగా విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక పార్ట్ టు తాజాగా విడుదలైంది. ఇక ఇందులో బాలయ్య ప్రభాస్ గోపీచంద్ లకు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ని కొంతమంది హీరోయిన్లను చూపిస్తూ ప్రశ్నలు సంధించాడు. అందులో నయనతార, తమన్నా ఇద్దరిని చూపిస్తూ వారిలో ఎవరితో షాపింగ్ కి వెళ్తావ్ అంటే ఇద్దరితో అని ప్రభాస్ చెప్పాడు.

ఆ తర్వాత శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే ఫోటోలు చూపిస్తూ వీళ్ళలో ఎవరితో సినిమాకి వెళ్తావ్ అని అడిగితే ఇద్దరినీ తీసుకెళ్లను అని సరదాగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కృతి సనన్, అనుష్క ఫోటోలను చూపించి ఇద్దరితో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళతో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తే ఎవరితో నిజమని నమ్ముతారు అని బాలకృష్ణ అడగగా.. ప్రభాస్ మాత్రం చాలా తెలివిగా ఎవరిని నమ్మరంటూ జవాబు ఇచ్చాడు. కానీ షోలో ఉన్న ఆడియన్స్ మాత్రం ప్రభాస్ అనుష్క డేటింగ్ లో ఉన్నారనే విషయాన్ని నిజమని నమ్ముతారంటూ చెప్పారు. ఇలా పార్ట్ 2 ఎపిసోడ్ అంతా కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: