మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు శంకర్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. కియరా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సునిల్ ... అంజలిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ న్యూజిలాండ్ లో ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. న్యూజిలాండ్ షెడ్యూల్ లో ఈ సినిమా బృందం రామ్ చరణ్ ... కియరా అద్వానీ లపై ఒక సాంగ్ ను మరియు మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. న్యూజిలాండ్ లో ఈ మూవీ యూనిట్ చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకే హైలైట్ గా నిలవనినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ... ఈ భారీ అంచనాలు కలిగిన క్రేజీ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: