నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... శృతి హాసన్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ... దునియా విజయ్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇది ఇలా ఉంటే ఇది వరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ మూవీ లో జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులను విమర్శకులను మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ మరో సారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈమె పాత్ర పై ప్రేక్షకులు భారీ అంతరాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. అ

లాగే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన యుఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షో కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ లు కూడా ఓపెన్ అయ్యాయి. దానిలో భాగంగా ఈ మూవీ కి ఇప్పటికే 250 కే ప్రీ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా యూఎస్ఏ లో ఈ సినిమాకు సూపర్ కలెక్షన్ లు ఫ్రీ సేల్స్ ద్వారా లభిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: