నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ వీర సింహా రెడ్డి లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటించింది.

సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా .... ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ సంస్థ ఈ మూవీ ని నిర్మించింది. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా ... దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ యూనిట్ ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: