టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఉన్న చాలామందికి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.దీనికి అంతటికీ కారణం మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడమే. ఈ స్థాయికి మెగాస్టార్ చిరంజీవి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వాటిని పట్టించుకోకుండా సినిమాల మీద తనకి ఉన్న ఇష్టంతో ఈ స్థాయికి ఎదిగాడు. అయితే ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150 సినిమాలకి పైగానే చేశాడు. 

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రేపు విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనమీద గతంలో జరిగిన విష ప్రయోగం గురించి తాజాగా క్లారిటీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. నాపై ఉన్న పిచ్చి అభిమానంతో ఒక అభిమాని నాపై విషప్రయోగం చేశాడు.

అప్పట్లో అభిమానులు డైరెక్ట్ గానే హీరోలను కలిసేవారు ..అయితే అప్పట్లో ఒక సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు నా అభిమాని నా బర్త్ డే కి ఒక కేక్ తీసుకోవచ్చాడు.. సాధారణంగా నేను కేక్ ని స్పూన్ తో తింటాను.. కానీ ఆ రోజు ఆ అభిమాని మాత్రం బలవంతంగా చేతితో ఆ కేక్ ను నాకు తినిపించాడు.. కేక్ చేదుగా ఉంది.. దాంతో నేను ఉమ్మేసాను..దాని తర్వాత ఆ కేక్ లో ఏదో పౌడర్ ఉంది అని తెలిసింది.. వెంటనే ఆ అభిమానిని పట్టుకొని కొట్టడంతో అసలు విషయం చెప్పాడు.. ఆయన నా అభిమాన సంఘం అధ్యక్షుడు.. చాలా రోజులు ఆ వ్యక్తిని నేను పట్టించుకోలేదని.. కేరళ వెళ్లి ఏదో వశీకరణ పౌడర్ ని తెచ్చి నన్ను వశపరచుకోవాలని ఆ కేక్ లో ఆ పౌడర్ని కలిపాడట అభిమాని అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: