టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఒక్కొక్క సినిమాతో తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే నేషనల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇకపోతే సినిమాలపరంగా ఎంత సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగతంగా విమర్శలు అయితే ఎదుర్కొందని చెప్పవచ్చు. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని మరింత ఎదుర్కొందని చెప్పడంలో సందేహం లేదు. అందుకే సమంత ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. వరుస సినిమాలు చేయబోతోంది అని తెలిపిన కొద్ది రోజులకే తాను మయో సిటీస్ వ్యాధి బారిన పడ్డాను అని అందరికీ తెలిపి షాక్ ఇచ్చింది. సెలబ్రిటీలు కూడా ఈమె త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఇకపోతే యశోద సినిమా షూటింగ్ సమయంలోనే తాను ఈ వ్యాధి బారిన పడినట్టు వెల్లడించింది .

ఇకపోతే యశోద సినిమా సమయంలో తన పరిస్థితి మరింత దిగజారడంతో బెడ్ పైనుంచినే సినిమా డబ్బింగ్ చెప్పుకుంది.  అయితే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం హాజరు కాలేకపోయింది. కేవలం సుమాతో ఒక ఇంటర్వ్యూ మాత్రమే చేసిన సమంత ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుట పడడంతో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన  శాకుంతలం సినిమాలో ఆమె హీరోయిన్గా నటించి.. ఇందులో కీలక పాత్ర పోషించిన సమంత ఈ శాకుంతలం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించినా ఇందులో కీలక పాత్ర పోషించిన సమంత ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటున్నారనటంలో సందేహం లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత యశోద సినిమా కంటే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లోనే కొంచెం ఎక్కువగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.  అయితే ప్రతి స్టేట్ లో కాకుండా కేవలం ముఖ్యమైన ప్రాంతాలలో మాత్రమే ఆమె ప్రమోషన్స్ లో  పాలు పంచుకోనున్నట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం తక్కువ ప్రచారాలకు మాత్రమే ఈమె హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తన ఆరోగ్యం కొంతవరకు కుదుటపడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: