కొత్త బంగారు లోకం సినిమాలో ఏక్కాడా అంటూ ప్రేక్షకులను తెగ సందడి చేసిన నటి శ్వేతా బసు ప్రసాద్ గురించి అందరికీ తెలిసిన విషయమే

బాగా చబ్బీగా బొద్దు గా పొడువాటి జడ తో ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్వేతా బసు ప్రసాద్ తరువాత పలు సినిమాల లో నటించారు. అయితే ఈ సినిమాలు ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో మాత్రం ఆదరణ సంపాదించుకోలేకపోయాయి.

ఇక ఈమె కెరియర్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులను అయితే ఎదుర్కొన్నారు.తన కెరీర్ లో ఏర్పడిన ఈ ఒడిదుడుకుల నుంచి బయటపడి ఈమె బాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించినప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయారు.ఇలా తెలుగు తెరకు పూర్తిగా దూరమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ తన దృష్టి మొత్తం సినిమాల పైన పెట్టినట్లు సమాచారం.అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియా కు దూరంగా ఉన్నటువంటి ఈమె తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. శ్వేతా బసు ప్రసాద్ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితుల తో కలిసి పుట్టినరోజు వేడుకలను అయితే జరుపుకున్నారు. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఈ ఫోటోలు కాస్త చాలా బాగా వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల లో శ్వేతా బసు ప్రసాద్ ని చూసినటువంటి నెటిజన్స్ బాగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎంతో బబ్లీ గా ఉన్నటువంటి శ్వేతా బసు ప్రసాద్ ఎక్కడ అంటూ కొందరు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు గుర్తుపట్టలేనంతగా ఈమె మారిపోయిందని, తన కు ఏమైందంటూ నేటిజన్స్ కూడా సందేహాలను వ్యక్తపరుస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: