చాలామంది నటీనటులు ప్రస్తుతం ఓటిటి లోనే ఎక్కుగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలామంది సక్సెస్ అవుతున్నారు కూడామ్. ఇందులో భాగంగానే చాలా మంది నటీనటులు  వరుస పెట్టి సిరీస్ లో చేస్తున్నారు. ప్రస్తుతం ఫెయిడౌట్ అయిన చాలామంది ఓటీపీలో కనిపిస్తున్నారు. ఇక ఇలా ఓటిటి కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఒకరు. తాజాగా ఈమె డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రెండు వెబ్ సిరీస్ లలో నటించడం జరిగింది. ఈ రెండు వెబ్ సిరీస్ లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది అంజలి. ఇలా ఈ రెండు వెబ్ సిరీస్ లతో మళ్లీ తన టాలెంట్ను చూపించిన అంజలి 

 తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న rc 15 సినిమాలో కూడా ఈమె ఒక కీలక పాత్రకి ఎంపికైంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ తమిళంలో మంచి క్రీజ్ సంపాదించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇక 2010 లో ఫైన్స్ అనే సినిమాలో నటించిన ఈమె..దాని తర్వాత 2018లో పెరంబు అని సినిమాలో నటించింది. దాని అనంతరం మళ్లీ ఐదేళ్ల తర్వాత తాజాగా ఇప్పుడు మరో తమిళ సినిమాకి అంజలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని తెలుస్తుంది.

ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా తెలుగు, తమిళ భాషలలోనే నటించిన ఈమె ఇప్పుడు మలయాళం లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో అలరిస్తోంది అంజలి. గత కొంతకాలంగా ఈమెకి తెలుగు సినిమాలలో అవకాశాలు రాకపోయేసరికి ఇలా స్పెషల్ సాంగ్స్ లో సైతం నటించేందుకు ఒప్పుకుంటుంది అంజలి. కానీ ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా అటు తెలుగులో పలు సినిమాలలో నటిస్తోంది అంజలి. తెలుగుతోపాటు మళ్లీ తమిళ సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంది. ఏదేమైనప్పటికీ కెరియర్లో గ్యాప్ వచ్చింది అనుకున్న సమయంలోనే మళ్లీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది టాలీవుడ్ హీరోయిన్ అంజలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: