టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన కళ్యాణం కమనీయం అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... యువి క్రియేషన్ సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులనుకున్నంత రీతిలో ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా లభించలేదు. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినా ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా "ఓ టి టి" సంస్థ వారు దక్కించుకున్నారు. అలాగే ఈ మూవీ ని ఫిబ్రవరి 18 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయిన కళ్యాణం కమనీయం సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: