టాప్ హీరోలు అంతా 100కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటి 200కోట్ల కలక్షన్స్ వైపు పరుగులు తీయాలని గట్టిగా కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన రెండు పడవల సిద్దాంతంతో తన సినిమాలకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాడు అన్న కామెంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో కూడ పవన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడటమే కాకుండా అతడికి భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తూ ఇండస్ట్రీలో సంచలన వార్తలకు చిరునామాగా మారుతున్నారు.



లేటెస్ట్ గా నిర్మాత డివివి దానయ్య సుజిత్ దర్శకత్వంలో ప్రకటింపబడ్డ మూవీలో పవన్ కు ఇస్తున్న పారితోషిక వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. చిరంజీవి ప్రభాస్ జూనియర్ రామ్ చరణ్ మహేష్ లు తాము నటించే సినిమాలకు సంబంధించి 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.


‘పుష్ప’ బ్లాక్ బష్టర్ హిట్ కావడంతో ‘పుష్ప 2’ కు సంబంధించి అల్లు అర్జున్ 75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు అన్న వార్తలు కూడ వచ్చాయి. ఇప్పుడు వీరందరి కంటే పవన్ తన పారితోషికం విషయంలో నెంబర్ వన్ అనిపించుకోబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు దానయ్య సుజిత్మూవీ ప్రాజెక్ట్ లో పవన్ నటించడానికి 75 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ వస్తున్న వార్తలు విని పవన్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు.


అంతేకాదు ఈమూవీకి వచ్చే లాభాలలో మూడవ వంతు వాటా ఆఫర్ చేసారు అన్నవార్తలు కూడ వస్తున్నాయి. ఈ మూవీ ప్రాజెక్ట్ ను సెట్ చేసిన త్రివిక్రమ్ కు కూడ లాభాలలో వాట ఉంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కలే నిజం అయితే ఈమూవీ ప్రాజెక్ట్ కాస్ట్ 175 కోట్లు దాటుతుందని అంచనా. అదే నిజం అయితే ఈమూవీ 200 కోట్ల బిజినెస్ చేయవలసి ఉంటుంది. మరి ఆ స్థాయిలో ఈసినిమాకు బిజినెస్ జరుగుతుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: