మన టాలీవుడ్ పరిశ్రమ గ్రోత్ అంతకంతకు పెరిగిపోతుంది. ఎస్ ఎస్ రాజమౌళి పుణ్యమా ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా ఇండస్ట్రీగా టాలీవుడ్ దూసుకుపోతుంది.రాజమౌళిని ఫాలో అయ్యి మన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా హిట్లు కొడుతున్నారు. కాని బాలీవుడ్ వాళ్ళు తమ సినిమాలు ప్లాప్ అయ్యి మన మీద పడి ఏడుస్తున్నారు.ఇప్పుడు మన సినిమాలకు రివ్యూలు ఇస్తూ వారి పొట్ట నింపుకుంటున్నారు. అసలు వీరిస్తున్న కొన్ని రివ్యూలు చూస్తుంటే వీళ్లు సినిమాలు చూస్తున్నారా లేదా అనే డౌట్ రాక మానదు. విచిత్రంగా ఒక్కోసారి మూవీలు రిలీజ్ కాకముందే విశ్లేషణను ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ చేత పచ్చి బూతులు తిట్టించుకుంటున్నారు. అలా ఉమైర్ సంధు అనే వాడు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. మన హీరోల ఫ్యాన్స్‌కు కావాలని అతడు ఆగ్రహం తెప్పిస్తున్నాడు.ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా, రివ్యూవర్‌గా ఇంకా అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనను తాను కోట్ చేసుకునే ఇతడు .. ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీలపైనే.. అందులో కూడా మన టాలీవుడ్ టాప్ స్టార్ ల పైనే పడి తిట్లు తింటున్నాడు…


విడుదలకు రెడీ అవ్వడమే ఆలస్యం.. ‘జెస్ట్ ఇప్పుడే చూశాను.. ఇట్స్ డిజాస్టర్ ఫిల్మ్ .. ఇట్స్ యావరేజ్ ఫిల్మ్’ అంటూ పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో షార్ట్ రివ్యూలు ఇంకా ఫ్రాడ్ రివ్యూలివ్వడానికి ఆరాటపడుతున్నాడు.ఇక రీసెంట్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విషయంలోనే ఇదే చేశాడు. రిలీజ్‌కు వారం రోజుల ముందే సినిమాని చూశానంటూ.. చాలా రొటీన్గా వరెస్ట్ గా ఉందంటూ రివ్యూ చేశాడు. అలాగే బాలయ్య వీరసింహా రెడ్డి విషయంలోనూ ఇలాగే రివ్యూ చేశాడు.ఇలా తన రివ్యూస్ తో నెట్టింట వైరల్ అవుతున్నాననే ఉమైర్ అనుకుంటున్నాడు కానీ.. మన తెలుగు ఫిల్మ్ లవర్స్‌ ను హర్ట్ చేస్తున్నాడని మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఓవర్ యాక్షన్ బాగా చేశాడు. అంతేకాదు మొన్నీమధ్య ప్రభాస్ ఇంకా కృతి సనన్ ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని పోస్ట్ వేశాడు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఉమైర్ సంధును నెట్టింట గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: