ఇండస్ట్రీ లో ఒకప్పుడ్డు దయ్యలా సినిమాలు చేయడంలో కూడా బాగా పేరు సంపాదించినా విమర్శ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఐతే భయం అనేది మనిషి చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది అదే భయం మనిషిని ఎప్పటికీ ఉన్నచోట నుంచి కూడా కదలనివ్వదు. అలా ఒక స్థలం లేదా ఒక ప్రాంతం ఏదైనా భయం కలిగించే విషయం ఉందంటే జనాలు ఎవ్వరూ కూడా ఆ వైపు వెళ్లడానికి కూడా ఎవరు ఇష్టపడరు.

ఐతే దాంట్లో  నిజా నిజాలతో ఎవరికీ సంబంధం లేదు కానీ భయం అనే సెంటిమెంట్ ని గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు అందరూ.అలాంటిది ఒక సంఘటనే ఒక అపార్ట్మెంట్ విషయంలో జరిగింది. అది కూడా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రభావం కావడం అనేది విశేషం. ఐతే మరి వర్మకి ఈ భయం కల్పించే ఆ అపార్ట్మెంట్ కి ఉన్న రిలేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రామ్ గోపాల్ వర్మ 2003 లో చేసిన హర్రర్ మూవీ భూత్ కి డైరెక్షన్ చేసాడు. ఐతే అప్పట్లో ఈ మూవీ ఆరు కోట్ల బడ్జెట్ తో తీస్తే అది దాదాపుగా  నాలుగు రెట్ల వసూళ్లు సాధించి దయ్యలా సినిమాల్లోనే బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఐతే సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్కు వెన్నులో వణుకు పుట్టే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి.ఇక భూత్ మూవీ లో అజయ్ దేవగన్ మరియు ఊర్మిళ మెయిన్ లీడ్ గా చేసారు.అయితే ఈ మూవీ షూటింగ్ ముంబైలోని వీర దేశాయ్ రోడ్ లో ఒక అపార్ట్మెంట్ లో జరిగింది.

మూవీ షూటింగ్ అంతా దయ్యం కాన్సెప్ట్ తో ఉండడంతో ఈ ఫ్లాట్ లో నిజంగానే ఆత్మలు తిరుగుతున్నాయి అనే ప్రచారం బాగా జరిగింది. ఐతే 2003 నుంచి ఇప్పటి వరకు ఈ అపార్ట్మెంట్ ప్లాట్స్ లో ఎవరు దిగకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐతే నేటికి కూడా ఆ ఫ్లాట్ ఖాళీగా ఉండి అటు సైడు ఎవరైనా వెళ్లడానికి జంకుతున్నారు అంటే నమ్మడానికి ఆశ్చర్యం వేస్తుంది కాదా అనే విషయాన్నీ ఈమధ్య జరిగిన ఒక ముఖ ముఖి సంభాషణలో వర్మ చెప్పారు. ఆర్జీవి మూవీ వల్ల ఇలా ఒక ఇల్లు భూత్ బంగ్లా గా మారిపోవడం బట్టి చూస్తే ప్రజలకి ఇలాంటి సెంటిమెంట్స్ ను ఎంత బలంగా నమ్ముతున్నారో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: