చాలామంది హీరో హీరోయిన్లు ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని అలా హనీమూన్ కు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడున్న హీరో హీరోయిన్లు మాత్రం అలా అస్సలు చేయడం లేదు. ఇలా పెళ్లి చేసుకున్నారో లేదో మళ్లీ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ మరియు సిద్ధార్థ మల్హోత్రా విషయంలో కూడా ఇదే జరిగింది. తాజాగా కియారా అద్వానీ మరియు సిద్ధార్థ మల్హోతా రాజస్థాన్ లోని జైసల్మీర్ కి సమీపం లో ఉన్న ఒక స్టార్ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లి అనంతరం ముంబైలో సినీ రాజకీయ ప్రముఖులకు ఒక మంచి పార్టీని కూడా ఇచ్చారు ఈ జంట. అయితే పెళ్లి అయిపోయిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా రిసెప్షన్ చేసుకున్న ఈ జంట హనీమూన్ కి వెళతారని అందరూ భావించారు. కానీ కియారా అద్వానీ మాత్రం అందరూ అనుకున్నట్లు హనీమూన్ కి వెళ్ళలేదు త్వరలోనే కియారా శంకర్ మరియు రామ్ చరణ్ దర్శకత్వంలో నానున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈమె హనీమూన్ కి వెళ్ళకుండా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా షూటింగ్లో ఇంటర్వ్యూ ఉందని తెలుస్తోంది.

కియార  మాత్రమే కాదు సిద్ధార్థ కూడా దీన్ని ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో సిద్ధార్థ మల్హోత్రా తనకి సంబంధించిన కొత్త సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నాడు సిద్ధార్థ మల్హోత్రా. ఇలా ఈ  కొత్త జంట పెళ్లి చేసుకొని హ్యాపీగా హనీమూన్ కి వెళతారు అని అందరూ అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేశారు. మొన్నటిలో పెళ్లి చేసుకున్న అలియా భట్ కూడా వీరిలాగే చేసింది. రణబీర్ ను పెళ్లి చేసుకున్న వెంటనే షూటింగ్లో బిజీ అయింది అలియా భట్ .ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరూ కూడా తమ కెరియర్ పై ఫోకస్ పెడుతూ వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా ప్లాన్ చేసుకుంటున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: