యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆయన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దాదాపు పాన్ ఇండియా స్దాయిలో విడుదల అవుతున్నాయి. ఇంకా అలాగే వాటి బడ్జెట్ లు కూడా ఇప్పుడు ఓ రేంజిలో ఉంటున్నాయి.వరస పెట్టి సినిమాలు ఫినిష్ చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఊపిరి ఆడనంత బిజీగా ఉన్నారు. జూన్ నెలలో ఆదిపురుష్ సినిమా  రిలీజ్ అయితే ఇక సలార్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కు వస్తోంది. ఇక ప్రాజెక్టు కె అయితే జనవరి 2024న విడుదల అవుతోంది. ఇలా ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది అసలు మామూలు విషయం కాదు. ఈ మూడు సినిమాల బడ్జెట్ లు కలిపి ఏకంగా 1500 కోట్లు దాకా ఉంది. దాంతో ట్రేడ్ లో ఇప్పుడు ప్రభాస్ గురించే చర్చలు జరుగుతున్నాయి.


రాబోయే సంవత్సరం అంతా దాదాపు రెబల్ స్టార్ ప్రభాస్ మేనియా కనపడుతుందని అంచనా వేస్తున్నారు.అయితే ఇక్కడే ప్రభాస్ కు చాలా పెద్ద టాస్క్ అనేది ఉంది. బాహుబలి సినిమా ఆల్ ఇండియా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడంతో ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో ప్రభాస్ స్టార్ డమ్ కూడా విపరీతంగా పెరిగింది. కానీ, బాహుబలి లాంటి విజయాన్ని ఇప్పటి దాకా ప్రభాస్ అందుకోలేకపోయాడు. సాహో ఇంకా రాధే శ్యామ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా పరాజయం పాలయ్యాయి. దాంతో ఓ ప్రక్కన టెన్షన్ గా కూడా ప్రభాస్ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు రాబోతున్న సినిమాలు హిట్ అయితే ప్రభాస్ మార్కెట్ ఇంకా పెరుగుతుంది. ప్లాప్ అయితే ప్రభాస్ చాలా నష్టపోతాడు.మరి చూడాలి ఈ సినిమాలు ప్రభాస్ కి ఎటువంటి విజయాన్ని అందిస్తాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: