విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3 తర్వాత ఈసారి సీరియస్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నారు. హిట్ 1, హిట్ 2 సినిమాల దర్శకుడు శైలేష్ తో కలిసి సైంధవ్ అనే భారీ కమర్షియల్ సినిమాకు శ్రీకారం చుట్టాడు వెంకీ మామ. సైంధవ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు ఏర్పరచుకుంది. శైలేష్ కొలను వెంకటేష్ ని ఎలా చూపించాలని అనుకుంటున్నాడో ఒక్క టీజర్ లోనే చెప్పేశాడు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ భారీగా ఉండగా సినిమాపై అది మరింత పెరిగేలా ఉంది. ఇక వెంకటేష్ సైంధవ్ లో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నవాజుద్ధీన్ సిద్ధికి ని తీసుకోగా లేటెస్ట్ టాక్ ప్రకారం మరో హీరోని కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇంతకీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ స్టార్ ఎవరంటే కోలీవుడ్ హీరో ఆర్య అని తెలుస్తుంది. తమిళంలో విలక్షణ నటుడిగా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఆర్య తెలుగులో కూడా సినిమాలు చేశారు. ఆయన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవగా అల్లు అర్జున్ వరుడు, వర్ణ సినిమాల్లో ఆయన నటించారు. ఇక ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో సైంధవ్ తో ప్రేక్షకులను పలుకరించబోతున్నారు. సైంధవ్ సినిమా కచ్చితంగా వెంకటేష్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆర్య రోల్ కూడా బాగుంటుందని తెలుస్తుంది.

వెంకటేష్ సినిమాల్లో ప్రత్యేకమైన సినిమాగా సైంధవ్ ఉంటుందని తెలుస్తుంది. మెడికల్ మాఫియా నేపథ్యంతో సైంధవ్ సినిమా తెరకెక్కుతుందని టాక్. శైలేష్ కొలను ఈ సినిమా స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్ గా రాసుకున్నారని తెలుస్తుంది. సైంధవ్ సినిమాను త్వరగానే పూర్తి చేసి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ శైలేష్ హిట్ యూనివర్స్ లో భాగంగా హిట్ 3 ని అనౌన్స్ చేశాడు. నాని హీరోగా వస్తున్న హిట్ 3 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా సైంధవ్ ని పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్.


మరింత సమాచారం తెలుసుకోండి: