కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వన్ అఫ్ ది టాప్ హీరో గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ధనుష్ ప్రెసెంట్  తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఐతే ఆయన అలా వరుస మూవీలలో చేస్తున్నటువంటి ధనుష్ లేటెస్ట్ గా తన డ్రీమ్ హౌస్ లోకి అడుగుపెట్టారు. చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయిస్ గార్డెన్ లో దాదాపు పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు సంవత్సరాల క్రితం ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఐతే  రెండు సంవత్సరాల క్రితం ఐశ్వర్య ధనుష్ భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఆ విధంగా ధనుష్ అన్ని సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.అయితే ఇంటి నిర్మాణం కంప్లీట్ అవ్వడంతో  ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహప్రవేశం చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాకపోతే ఐశ్వర్యతో విడాకులు తీసుకుని విడిపోయిన ధనుష్ ప్రెసెంట్ తన తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేశారు.ఇలా తన భార్య పిల్లలతో కలిసి ఈ ఇంటిలో ఉండడం కోసమే ఈయన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు.ఐతే తన భార్యతో విడిపోయినప్పటికీ ఇంటి నిర్మాణం మాత్రం ఆపలేదని తెలుస్తుంది. ఇలా అన్ని హంగులతో నిర్మించిన ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు నూట యాభై కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇలా భారీ హంగులతో అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించి ఆ ఇంటిలో నివసించాలనేదే ధనుష్ కోరిక అని అయితే ప్రెసెంట్ తాను విడాకులు తీసుకోవడంతో ఆ ఇంటిని తన తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారని ధనుష్ సన్నిహితుల నుండి సమాచారం అందింది . ఇలా ధనుష్ నూతన ఇంటికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రెసెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఐతే ఆయన సినిమాల విషయానికొస్తే లేటెస్ట్ గా సార్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కాకపోతే ఇది ఆయనకు మొదటి తెలుగు సినిమాఅవ్వడం ఒక విశేషం.
ఈ సినిమాతో ప్రేక్షకులకు మనసులో ఒక సుస్థిరమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకున్నారు ధనుష్.

మరింత సమాచారం తెలుసుకోండి: