కోలీవుడ్ లేడీ తలైవీగా గుర్తింపు తెచ్చుకున్న త్రిష గురించి ప్రత్యేకంగా ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేదు.. కేవలం సౌత్ ఇండియన్ సినిమాలలోనే కాదు అటు నార్త్ ఇండియన్ సినిమాలతో కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాల కు పైగానే అవుతున్నా.. తన అందంతో.. పాపులారిటీతో ఎప్పటికప్పుడు అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. మొన్నటి వరకు అడపాదడపా అవకాశాలు అందుకున్న ఈమె ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో కుందవై పాత్ర పోషించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను అవకాశాలు లభిస్తూ ఉండడం గమనార్హం.

ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమాలో త్రిష కి అవకాశం కల్పించారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ నిమిత్తం కాశ్మీర్ కి వెళ్ళిన చిత్రబృందం అక్కడ 15 రోజులపాటు సినిమా షూటింగ్ పూర్తి చేశారు..కానీ చలి కారణంగా త్రిష అక్కడి నుంచి జ్వరం రావడంతో చెన్నై చేరుకుంది.  ఈ నేపథ్యంలోనే త్రిష లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న లియో సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు బాగా వినిపించాయి.  కానీ వీటిపై స్పందించిన త్రిష లియో సినిమా షూటింగ్ నుంచి రావడం కొన్ని అనారోగ్య కారణాలవల్లే.. కానీ సినిమా నుంచి తప్పుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

నిజానికి తాను లియో సినిమా నుంచి తప్పుకోలేదు అని అందులో మిగతా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోంది అందులో భాగం కానున్నాను అని త్రిష వెల్లడించింది.  ఇక మరొకవైపు ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ బ్రిందా మాత్రం ఆగిపోయింది.. అయితే ఈ వెబ్ సిరీస్ ఎందుకు ఆగిపోయింది అనే విషయంపై మాత్రం త్రిష క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: