జ్యోతిస్యుడు వేణు స్వామి సెలబ్రిటీలకు మరియు రాజకీయ నాయకులకు వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఎంతోమంది సెలబ్రిటీల విషయంలో ఈయన చెప్పింది చెప్పినట్టు దాదాపు జరిగిందనే చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.

 

యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో 45 సంవత్సరాలు లోపు మేషరాశికి చెందిన యంగ్ హీరోయిన్  మరియు వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన యంగ్ హీరో మరణిస్తారని చెప్పుకొచ్చారు... అది సహజ మరణం అయినా కావచ్చు లేదా ఆత్మహత్య అయినా కావచ్చు అంటూ ఆయన తెలిపిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అంతేకాదు కొంతమంది వేణు స్వామి మాటలను కొట్టి పారేస్తే మరికొంతమంది నిజమే నేమో అని అనుకున్నారు.. అయితే అది అనుకున్నట్టుగానే ఇప్పుడు తారకరత్న మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో వేణు స్వామి చెప్పిన మాటలు మళ్ళీ బాగా వైరల్ గా మారుతున్నాయి. తారకరత్న గుండెపోటుతో 40 సంవత్సరాలకే మరణించడంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడింది.

యంగ్ హీరో మరణించాడు మరి ఆ యంగ్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. తారకరత్న మరణంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వేణు స్వామి గతంలో కూడా సమంత మరియు నాగచైతన్య వివాహం చేసుకునేటప్పుడు వీరి జాతకం ప్రకారం ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే వారు కూడా నాలుగు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వరుసగా వేణు స్వామి చెబుతున్న  మాటలు నిజం అవడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ భయాందోళనకు గురి అవుతుందని సమాచారం.తారకరత్న మరణంతో వేణు స్వామి పై ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: