జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటన కు  విదేశీ ప్రేక్షకులు సైతం కూడా ఎంతగా నో ఫిదా అయ్యారు.

ఆస్కార్ అవార్డ్ కు ఎన్టీఆర్ నామినేట్ అవుతారని ప్రచారం జరిగినా కూడా ఆ ప్రచారం నిజం కాకపోవడం నందమూరి అభిమానులను బాధ కలిగించింది.. అయితే ఎన్టీఆర్ కు జాతీయ అవార్డ్ అయినా రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

అయితే రిషబ్ శెట్టి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ  ఎదురవుతోందని తెలుస్తుంది.. కాంతార సినిమాలో రిషబ్ శెట్టి చాలా అద్భుతంగా నటించారు. రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు వెల్లువగా వచ్చాయి.. ఎన్టీఆర్ మరియు రిషబ్ ల లో ఒకరికి అవార్డ్ గ్యారంటీ కాగా ఎవరికి అవార్డ్ వస్తుందనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. బాలీవుడ్ క్రిటిక్స్ ఎన్టీఆర్ కంటే రిషబ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం విశేషం.జాతీయ అవార్డుల విషయంలో సైతం కొన్ని రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టిని దాటి జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డ్ రావడం కుదురుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు అయితే ఆగాల్సిందేనని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి.నాటు నాటు సాంగ్ కు మాత్రం ఆస్కార్ అవార్డ్ రావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వస్తున్నాయి.. జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభతో అందరినీ బాగా ఆశ్చర్యపరుస్తున్నారు. ఎన్టీఆర్ కు ఊహించని స్థాయి లో క్రేజ్ పెరుగుతోంది.
ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా పెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: