జాతి రత్నాలు అనే సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఆ సినిమా తర్వాత తను ఆశించిన స్థాయిలో సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోయింది.
        ఆ మధ్య ఒక సినిమా లో కనిపించిన కూడా పెద్దగా ఆమె కు ఆసెంచేనంత పేరు లభించలేదు. అంతే కాకుండా ఆఫర్స్ విషయం లో కూడా ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే ఫరియా చాలా వెనుకబడి ఉంది. అందుకే ఫరియా అబ్దుల్లా కెరియర్ లో ప్రస్తుతం నటిస్తున్న రవితేజ యొక్క రావణాసుర అనే సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ రావణాసుర సినిమా లో మొత్తం  ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయినా కూడా ఈ ముద్దు గుమ్మకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది, సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఈ అమ్మడు కనిపించబోతుందట అందుకే రావణాసుర పై ఈ అమ్మడు ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఉందంటూ వార్తలొస్తున్నాయి.
      అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రావణాసుర సినిమా ఉంటుందని మూవీ మేకర్స్ చాలా బలంగా వాదిస్తున్నారు. జాతి రత్నాలు సినిమా స్థాయిలో మరో విజయాన్ని సొంతం చేసుకుంటే కానీ మళ్ళీ ఫరియా కెరియర్ లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ అమ్మడికి ఆ స్థాయి విజయాన్ని రావణాసురకి అందించేనా అనేది చూడాలి. ఫరియా అబ్దుల్లా యొక్క సహ నటుడు అయినా నవీన్ పొలిశెట్టి ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు గాను రెడీ అవుతున్నాడు. మరో సారి తనతో నటించే అవకాశం కూడా ఈ అమ్మడికి రావొచ్చు అని ప్రచారం జరుగుతోంది. రవితేజ రావణాసుర సినిమాకి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. కనుక ఫరియా కు మంచి విజయం సొంతం అయ్యే అవకాశాలు కూడా గట్టిగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: