ఆవారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న లింగుస్వామి ?

తెలుగులో మంచి హిట్ అయిన తమిళ డబ్బింగ్ సినిమాలలో `ఆవారా`కూడా ఒకటి. ఈ సినిమాతో తెలుగులో కార్తికి తన అన్న సూర్య లాగే మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించగా, ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు.తెలుగులో పెద్ద హిట్‌ అయ్యింది. 2010లోనే ఈ సినిమా ఏకంగా 10 కోట్ల పైన వసూలు చేసింది. ఈ సినిమా హిట్ తో అప్పటినుండి  కార్తి నటించే ప్రతి సినిమా తెలుగు ఇంకా తమిళంలో ఏక కాలంలో విడుదల అవుతుండటం విశేషం. అలాగే ఇవి మంచి వసూళ్లని రాబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు `ఆవారా`సినిమాకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు లింగుస్వామి. `పందెంకొడి` సినిమాతో దర్శకుడిగా ఆయన తనేంటో నిరూపించుకున్నారు. ఇటీవల రామ్‌ హీరోగా `ది వారియర్స్` మూవీని తీశారు. కానీ ఆయన రూపొందించిన `పందెంకోడి 2`, `ది వారియర్స్` సినిమాలు ప్లాప్ అయ్యాయి.


 ఈ నేపథ్యంలో దర్శకుడిగా తానేంటో మళ్ళీ నిరూపించుకోవాల్సిన టైమ్‌ వచ్చింది. అందుకే ఇక `ఆవారా` సినిమాకి సీక్వెల్‌ని చేయబోతున్నారట.ఆవారా సీక్వెల్‌ కథని కార్తి, సూర్యలకు చెప్పారు లింగుస్వామి. కానీ వాళ్లు ఇందుకు నో చెప్పారు. దీంతో మరో హీరో ఆర్యకి చెప్పగా,ఇక ఆయన ఓకే చేశారని సమాచారం తెలుస్తుంది. దీంతో `ఆవారా2`ని పట్టాలెక్కించే పనిలో దర్శకుడు ఫుల్ బిజీ అయ్యారు. ఇంకా అంతేకాదు కాస్టింగ్‌ అలాగే టెక్నీషియన్లని ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేతో చర్చలు జరుపుతున్నారట. మరి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? లేదా అనే సందేహం నెలకొంది. ఒకవేళ పూజా హెగ్డే కనుక ఓకే చెబితే ఈ సినిమాకి ఖచ్చితంగా చా మంచి క్రేజ్‌ వస్తుందని చెప్పొచ్చు.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: