ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతగానో పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని కొత్త షోస్ పుట్టుకొచ్చినప్పటికీ అటు ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం తక్కువ కావడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లో దొరకని ఎంటర్టైర్మెంట్ను బుల్లితెర ద్వారా పొందగలుగుతున్నారు ప్రేక్షకులు. ఏదైనా షో వచ్చిందంటే చాలు ఆ షో కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని షోలు తమ టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి ఏం చేయడానికి అయినా సిద్ధం అవుతున్నాయి అని చెప్పాలి.


 ఎందుకంటే ఒకప్పుడు షో ఎలా ఉండబోతుంది అన్న విషయంపై చిన్న హీంట్ ఇవ్వడానికి ముందుగా ప్రోమోలను విడుదల చేసేవారు. ఇక ఈ ప్రోమో లు చూసిన తర్వాత షోలో గెస్ట్ లుగా ఎవరు ఉన్నారు. ఇక ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అనేదానిపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి ప్రోమోలను టిఆర్పి స్టంట్ కోసం ఉపయోగించుకుంటున్నారు అని చెప్పాలి. తమ షో లకి పిలుస్తున్న సెలబ్రిటీల మధ్య గొడవ జరుగుతున్నట్లుగా లేదా ఒకరిని ఒకరు కొట్టుకున్నట్లుగా చూపించడం లేదా స్టేజ్ మీద సెలబ్రిటీలు తిట్టుకున్నట్లుగా చూపించి ప్రోములను సోషల్ మీడియాలోకి వదులుతున్నారు.


 అయితే ఇలాంటి ప్రోమోలు సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ప్రోమోలో జరిగింది నిజమేనేమో అనుకొని ఎంతోమంది ఎపిసోడ్ చూసేవారు. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి టీఆర్పి స్తంట్లు కామన్ గా మారిపోయాయి. దీంతో చూసి చూసి ప్రేక్షకుడికి చిరాకు వస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే సుమా అడ్డ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో ఏకంగా అరియనా, అఖిల్ సార్ధక్, తేజస్విని ముగ్గురు కూడా గొడవ పడినట్లు చూపించారు. అంతేకాదు తేజస్విని అలరియనా గ్లోరీలు అఖిల్ ను  అసలు నువ్వెంత ఆఫ్ట్రాల్ అన్నట్లుగా మాట్లాడటం చేశారు. దితోదీంతో అఖిల్ షో నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి ఇలాంటి టిఆర్పి స్టంట్స్ చూసి చిరాకు వచ్చేస్తుంది భయ్యా అని ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: