సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎప్పుడు స్థాయికి తగ్గట్లుగానే హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే అందరిలాగానే సినీ సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇక ఇలాంటి పర్సనల్ లైఫ్ ను కెమెరా కంట పడకుండా రహస్యంగానే ఉంచుకోవడానికి ఎంతమంది సినీ సెలెబ్రిటీలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది హీరో హీరోయిన్లు తప్ప తాగి ఇక కెమెరాల ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వారి స్థాయిని మరిచి ప్రవర్తిస్తూ చివరికి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 బాలీవుడ్ నటి కాశ్మీరా షా సైతం ఇక ఇలాంటి ప్రవర్తనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.  తప్ప తాగి ఏకంగా కెమెరా ముందుకు వచ్చింది అని చెప్పాలి. ఎంతలా అంటే కనీసం ఆమెకు నిలబడడానికి కూడా ఓపిక లేనంత మత్తులో ఉంది సదరు నటి. ఈ క్రమంలోనే ఏం చేస్తుందో అన్న విషయాన్ని కూడా మరిచి భర్తతో ఇక కెమెరా ముందే లిప్ లాక్ లో మునిగిపోయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బయటకు మారిపోయింది. భర్తతో కలిసి ఒక పార్టీకి వెళ్లిన కాశ్మీర షా  అతిగా మద్యం సేవించి ఉన్న సమయంలో మీడియా పలకరించింది. దీంతో మత్తులో ఉన్న ఆమె రకరకాల ఫోజులు ఇచ్చింది అని చెప్పాలి. ఇక అంతలోనే భర్త కృష్ణ అభిషేక్ అక్కడికి రావడంతో ఇక గట్టిగా లిప్ లాక్ ఇచ్చింది.



 ఇకపోతే కాశ్మీర షా  సినిమాల విషయానికొస్తే.. 1997లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఎస్ బాస్ అనే సినిమాతో నటిగా ఎంట్రీ  ఇచ్చింది.  ఆ తర్వాత కోయి కిసీసే కమ్ నహీం,  ప్యార్ తో హోనా హిత, హిందూస్థాన్ కా కసం, కహీన్ ప్యార్ నహోజాయే, ఔర్ పప్పు పాస్ హోగయా లాంటి తదితర చిత్రాల్లో నటించింది. అయితే మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. 2013లో నటుడు కృష్ణ అభిషేక్ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం కాశ్మీర షా సినిమాలకు దూరంగానే ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: