తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వారిసు'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాని టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.కన్నడ యంగ్ బ్యూటీ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జయసుధ, శ్రీకాంత్, కిక్ శామ్.. వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 11న ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యింది. ఇక అక్కడ మంచి టాక్ తెచ్చుకోవడంతో తెలుగులో కూడా భారీ అంచనాలు పెరిగాయి.తెలుగు వెర్షన్ 'వారసుడు' పేరుతో జనవరి 14 వ తేదీన రిలీజ్ అయ్యింది. తొలి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా తక్కువగానే నమోదయ్యాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా తెలుగులో 15 కోట్లు దాకా వసూళ్లు రాబట్టి హిట్ గా నిలిచింది. 


ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి రూ.0.80 కోట్ల ప్రాఫిట్ ను అందించి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మూవీ. విజయ్ తెలుగు మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందని ఈ మూవీ ద్వారా మరోసారి రుజువు అయ్యింది.ఇక టోటల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల దాకా గ్రాస్ అందుకొని హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి 'లియో' సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తరువాత తనకు 'బిగిల్ 'లాంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన అట్లీ తో విజయ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో విజయ్ మొదటగా 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.ఈ సినిమా పై కూడా జనాల్లో ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: