సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లు అయినటువంటి పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన బ్యానర్ లలో ఒకటి అయినటు వంటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్ లు బయటికి వస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అయినటువంటి భూమి పడ్నేకర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... ఈ ముద్దుగుమ్మ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో భూమి పడ్నేకర్ కనిపించబోతుంది అనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ... ఇది ఒక ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. ఇక మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు గానే ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: