బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. తన అందంతో యాంకరింగ్ తో తన చూపులతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈమె. ప్రస్తుతం  బుల్లితెరకు దూరమై ఎక్కడ కూడా కనిపించడం లేదు.ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం సినిమాల పైనే పెట్టి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. మొదట తన కెరీర్ న్యూస్ లీడర్గా మొదలుపెట్టి దాని అనంతరం యాంకర్ గా ప్రస్తుతం గట్టిగా కొనసాగుతోంది ఈమె. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుల్లితెరను వదిలేసి వెండితెరపై అనసూయ బాగా దృష్టి సారించడంతో డబ్బు పరంగా అనసూయ బాగా నష్టపోయింది అని అంటున్నారు. 

జబర్దస్త్ యాంకర్ గా ఉన్నప్పుడు అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. బుల్లితెరను వదిలి వెళ్ళిపోతే టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా అవుతాను అన్న ఆలోచనతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈమె. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. అనసూయ అనుకున్నట్టు ఒక్కటి కూడా జరగలేదు. రంగస్థలం పుష్ప వంటి సినిమాలతో అనసూయ సక్సెస్ అయినప్పటికీ దాని అనంతరం అనసూయకి అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి. ఈ రెండు సినిమాల అనంతరం కొన్ని సినిమాలలో నటించి సక్సెస్ అయినప్పటికీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం వర్కౌట్ కాలేదు ముఖ్యంగా గతేడాది రవితేజ హీరోగా నటించిన కిలాడి సినిమాలో నటించింది అనసూయ.

 ఇక ఆ సినిమాలో అనసూయ పాత్రను చూసి అందరూ చాలా నవ్వుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు అనసూయ చేసినప్పటికీ తనకి సరైన గుర్తింపు రాలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం అనసూయ ఎలాంటి షోలలో కూడా కనబడడం లేదు. దాంతోపాటు పుష్పటు సినిమా తప్ప మరే పెద్ద సినిమాల్లో కూడా నటించడంలేదు అనసూయ. ప్రస్తుతం కష్ట కాలంలో ఉన్న అనసూయ కి ఖచ్చితంగా రెండు మూడు హిట్ సినిమాలు పడితే గాని మళ్లీ ఆశించిన విధంగా కెరియర్లో దూసుకెల్లకపోవచ్చు అని చెప్పాలి. మునుపటి క్రేజ్ అనసూయ కి మళ్ళీ రావాలి అంటే పెద్ద సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే అనసూయ బుల్లితెరను వదిలి వెళ్ళిపోవడం వల్లే కష్టాల పాలయ్యింది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: