తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు  ఈ దర్శకుడు మొదట కథా రచయితడిగా పనిచేసి ఆ తర్వాత సినిమా దర్శకుడిగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ దర్శకుడు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఆఖరుగా అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన అలా వైకుంఠపురంలో అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇలా అలా వైకుంఠపురంలో మూవీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు తో మూవీ చేస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు ... ఖలేజా మూవీ లు రూపొందాయి. ఈ మూవీ లకు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ భారీ క్రేజ్ కలిగిన మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఏప్రిల్ నెల చివరి వరకు ఈ మూవీ లోని పాటలు మరియు ఒక ఫైట్ సన్నివేశం మినహా మొత్తం చిత్రీకరణ పూర్తి అయ్యే విధంగా ఈ చిత్ర బృందం ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యాక్షన్ సన్నివేశాల విషయానికి వస్తే ఈ మూవీ లో కేవలం 3 యాక్షన్ సన్నివేశాలు మాత్రమే ఉండబోతున్నట్లు ... కాకపోతే ఈ మూడు యాక్షన్స్ సన్నివేషాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: