ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు అంటూనే మరొకవైపు ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఈమధ్య ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లబోతోంది.. నిజానికి పవన్ కళ్యాణ్ తో హరీష్ మరో సినిమా అనుకున్నాడు కానీ ఇప్పుడు తేరీ సినిమాను రీమేక్ చేయాల్సి వచ్చింది. గతంలో గబ్బర్ సింగ్ అనే రీమేక్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న పవన్.. హరీష్ కాంబో ఇప్పుడు కూడా రీమేక్ తోనే రావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ కాంబినేషన్ మీద ప్రస్తుతం అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అభిమానులకు శుభవార్త తెలుపుతూ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ ,సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఇందులో ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాకి ఆయన కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారు.  ఆ 20 రోజులకు గానూ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఉస్తాద్ సినిమాకి షిఫ్ట్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన ఒకటి రెండు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత సుజిత్ తో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఇలా ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు తాను ఫినిష్ చేయాలనుకున్న సినిమాలను కూడా ఆయన త్వరలోనే కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాల ద్వారా వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలను కోసం రెచ్చిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: