RRR సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇలా 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా మొదటిసారి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ వేడుకను ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆస్కార్ అవార్డు విషయంపై స్పందిస్తూ చిత్ర బృందానికి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమా ఆస్కార్ అవార్డు పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు.

ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు వచ్చిన అనంతరం రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ తాను అవార్డులను అసలు నమ్మనంటూ కామెంట్ కూడా చేశారు. ఆర్ఆర్ఆర్ కి అవార్డులు వచ్చినా రాకపోయినా.. నా దృష్టిలో పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు. ఎందుకంటే ఈ సినిమా ఎఫెక్ట్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం కూడా చూసేసారు. ఒకవేళ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కనుక రాకపోయి ఉంటే అది ఆస్కార్ వాళ్ళ దురదృష్టం అంటూ కూడ వర్మ స్పందించారు.


 ఇక గత రెండు రోజుల క్రితం ఆస్కార్ సినిమా ప్రమోషన్ల కోసం 80 కోట్లు ఖర్చు చేశారు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించారని తెలుస్తుంది.. ఈ సందర్భంగా వర్మ ఈ సంగతి గురించి మాట్లాడుతూ..కొంతమంది ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కి రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారని చాలామంది అయితే కామెంట్స్ చేశారు. నా దృష్టిలో రాజమౌళి గారిని ఆయన సినిమాలను ఇలా కామెంట్ చేశారు అంటే చీమ ఏనుగును కామెంట్ చేసినట్లే అవుతుందని చెప్పారు.నా దృష్టిలో రాజమౌళి బాహుబలి అలాగే ఆర్ఆర్ఆర్ లతో ఎవరూ ఊహించని  మార్క్ ని అయితే సెట్ చేశాడు. ఇప్పుడు ఆస్కార్ అనేది  నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ కి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: