టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రెసెంట్ బుల్లితెర నటి నటులు ఏ కొంచం అవకాశం దొరికిన వెండితె ర పై కూడా తమ తమ మార్క్ చూపించుకుంటూ మనీ రెండు చేతుల్తో సంపాదిస్తున్నారు. అటువంటి యాంకర్ ఐనా అనసూయ గూర్చి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెల్సుకోవాలి. బుల్లితెర పై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకటి. అయితే గత కొద్ది రోజుల నుంచి అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఐతే అందుకు కారణం చేతి నిండా ఉన్న సినిమాలే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అనసూయ దూసుకుపోతోంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది.

ఆమె గత సంవత్సరం చేసిన `పుష్ప` సినిమాతో ఈమె క్రేజ్‌ మరింత పెరిగింది. ఇందులో దాక్షాయని పాత్రలో మంగళం శీను భార్యగా అద్భుతమైన నటనను కనబరిచి అదరగొట్టేసింది. ఈ మూవీ తర్వాత వెండితెరపై వరుస ప్రాజెక్టులతో అనసూయ ఫుల్ బిజీ గా మారింది. ఈ క్రమంలోనే తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.

ఐతే ఒకప్పుడు ఒక రోజుకు లక్ష నుంచి లక్షన్నర రెమ్యునరేషన్ తీసుకున్న అనసూయ ప్రెసెంట్ మాత్రం  ఏకంగా తన రెమ్యూనరేషన్ ను మూడు రెట్లు అనగా మూడు లక్షలు డిమాండ్ చేస్తుందట. ఏదేమైనా ఒక్క రోజుకే మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అయినా సరే ఆమెకు ఉన్న డిమాండ్‌, క్రేజ్‌ దృష్ట్యా అనసూయ అడిగినంత మొత్తం నిర్మాతలు ఇస్తున్నారని ఇన్‌సైడ్ టాక్‌.

ఐతే కొంతమంది మాత్రం దీన్ని సమర్ధుస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే మనం రెండు చేతుల్తో సంపాదించుకోవాలి. తర్వాత చేసేది ఏంలేదు అందుకే అనసూయ కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లున్నది.ఐనా తనకు అటు బుల్లితెర అలాగే వెండితెర అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: