కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన చిత్రాలలో కాంతారా చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలై అనుకోకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు ప్రేక్షకులు. కేవలం రూ .16 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన చిన్న సినిమాగా విడుదల చేయగా.. రూ.400 కోట రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద షేర్ చేసింది. విడుదలైన అన్నిచోట్ల కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది. అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది కాంతారా చిత్రం.


ఇందులో హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అజిత్ కుమార్ ,సప్తమి గౌడ ,ప్రమోద్ శెట్టి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. హోంబలే ఫిలిం బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో కూడా కలెక్షన్ల పరంగా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా సీక్వెల్ నిర్మించ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.


కాంతారా సినిమా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది దీనిని ఏకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. స్విజర్లాండ్ జెనీవాలో ఉన్న యూరప్ దేశాల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో రేపటి రోజున ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతోంది. ఇప్పటికే కాంతారా హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి జేనివాకు చేరుకున్నారు. ఐరాసాలో ప్రదర్శించబోతున్న మొదటి కనడ చిత్రం ఇదేనట. అడవులు, పర్యావరణ పరిరక్షణ అడవి ప్రాంతాలపై ఆధారపడిన కొంతమంది గిరిజనుల ఆదివాసుల సమస్యల పైన ఈ సినిమాని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఐక్యరాజ్యసమితిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా కథ కూడా యూనివర్సిటీ కావడంతో అందులో ఉండే ప్రతినిధులు దీనిని అధికారికంగా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: