పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస వేగంతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈమధ్యనే మొదలైన వినోదయ సీతం ఆయన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారట. సాయి ధరం తేజ్ తో పాటుగా ఈ సినిమాలో పవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ కు సంబంధించిన సీన్స్ అన్ని పూర్తయ్యాయని తెలుస్తుంది. ఇక డబ్బింగ్ టైం లో ఒకటి రెండు రోజులు టైం కేటాయిస్తే సినిమా పూర్తయినట్టే. అయితే సాయి ధరం తేజ్ తో సహా మిగతా కాస్టింగ్ తో వినోదయ సీతం రీమేక్ ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది.

ఏది ఏమైనా సెప్టెంబర్ కల్లా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్. మరోపక్క హరి హర వీరమల్లు సినిమాను కూడా దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా ఏప్రిల్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక సుజిత్ తో చేస్తున్న సినిమాకి కూడా మే నెల మొత్తం కేటాయించాడట పవన్ కళ్యాణ్. ఇదిలాఉంటే సుజిత్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ఫైనల్ చేశారట.

ఆ టైటిల్ నే దానయ్య తన ప్రొడక్షన్ లో రిజిస్టర్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ హరి హర వీరమల్లు సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనుకున్నారు. ఆ సినిమా లేట్ అవుతుంది. ఇప్పుడు సుజిత్ సినిమా కూడా ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. పవన్ సినిమా నేషనల్ వైజ్ గా రిలీజ్ చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. మొత్తానికి పవన్ తన సినిమాల వేగం పెంచి ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తున్నాడు. సుజిత్ ఓజీలో పవన్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: