రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నాని హీరో గా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టి ... ఆ తర్వాత మహానటి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ మణులలో ఒకరు అయినటు వంటి దీపిక పదుకొనే నటిస్తూ ఉండగా అమితా బచ్చన్ ... దిశా పటానిమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటికే ఈ చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  ప్రాజెక్ట్ కే మూవీ  దర్శకుడు నాగ్ అశ్విన్మూవీ ని ఏకంగా 8 భాగాలుగా ప్లాన్ చేసినట్లు ... అలాగే ఈ 8 భాగాలలో కూడా 8 మంది హీరోలు కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.  ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: