సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పోయిన సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. సముద్ర ఖని విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు.

ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. పూజ హెగ్డే ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఇంటర్వెల్ సన్నివేశంలో ఒక అదిరిపోయే ట్విస్ట్ రానున్నట్లు ... అలాగే ఇంటర్వెల్ సన్నివేశంలో మహేష్ బాబు కొత్త లుక్ రివిల్ కానున్నట్లు ... ఈ ట్విస్టు కూడా పూజా హెగ్డే క్యారెక్టర్ కు సంబంధించి ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి భారీ లెవెల్ లో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: