ఇటీవల కాలంలో బుల్లితెర నటీమణులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుండగా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక గా ఆ అనుభవాల గురించి పంచుకుంటున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన నటి దివ్య గణేష్  తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ నుంచి చెన్నై కు ఫ్లైట్ లో వెళ్లే సమయం లో నేను కూర్చున్న విమానంలో చాలా తక్కువమంది ప్రయాణికులు ఉన్నారని ఫ్లైట్ లో లాస్ట్ లో నేను కూర్చుని నిద్రపోతున్నానని ఆమె కామెంట్లు చేశారు. నేను నిద్రపోతున్న సమయంలో నా నడుముకు ఏదో తగులుతోందని అనిపించిందని దివ్య గణేష్ చెప్పుకొచ్చారు. మొదట నేను అలా ఏదో తగులుతున్నట్టు అనిపించినా పట్టించుకోలేదని ఆమె అన్నారు.

అయితే పదేపదే నా నడుము కు ఏదో తగులుతుంటే ఏం జరుగు తుందో అర్థం కాక చూశానని దివ్య గణేశ్ చెప్పుకొచ్చారు. విమానంలో నా వెనుక కూర్చున్న వ్యక్తి నా నడుమును తడిమాడని ఆమె కామెంట్లు చేశారు. మొదట పురుగు టచ్ అయిందేమో అని భావించిన నేను ఆ తర్వాత ఏం జరిగిందో అర్థమై షాకయ్యానని దివ్య గణేష్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించానని ఆమె అన్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాకియ లక్ష్మి అనే సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ విజయ్ టీవీలో ప్రసారమవుతోంది. కేలాడి కన్మణి అనే సీరియల్ తో ఈ నటి సినీ కెరీర్ మొదలైంది. దివ్య గణేష్ ఒకవైపు సీరియళ్ల లో నటిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. దివ్య గణేష్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నటికి భారీ స్థాయి లో క్రేజ్ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: