ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఫుల్ గా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలు థియేటర్ లలో రీ రిలీస్ అయ్యాయి. అందులో కొన్ని మూవీ లకు నైజం ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లు లభించాయి. నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్ జై సూర్య దర్శకత్వంలో రూపొందిన ఖుషి సినిమా నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు 1.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

జల్సా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా ... పార్వతి మెల్టన్ హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నైజాం ఏరియాలో 1.26 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

ఒక్కడు : మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆరెంజ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 75 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

పోకిరి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 69 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: