రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేంజ్ కు వెళ్ళింది.. ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని కూడా అలరించే విధంగా రాజమౌళి సినిమా లను రూపొందించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా ఏంటి అనేది ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతుందట.. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ను పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో ఉన్నాడట రాజమౌళి.

ఇదే సమయంలో రాజమౌళి ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ఆ విషయం లో ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. కానీ అభిమానులు మాత్రం రకరకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. సోషల్ మీడియాలో అభిమానులు రెండు పార్ట్ లు గా రాజమౌళి సినిమా ను రూపొందిస్తే అది ఎన్ని ఏళ్ల సమయం పడుతుందో అని దాని వలన కచ్చితంగా మహేష్ బాబు నుండి చాలా సినిమా లను మిస్ అవ్వబోతున్నాం అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. అయితే మూడు నాలుగు సంవత్సరాలు తీసుకుని రెండు పార్ట్ లుగా ఒక సినిమాను తీసుకు వచ్చినా కూడా పదేళ్ల కు సరిపడా మహేష్ బాబు అభిమానులకు మంచి సినిమా రాజమౌళి అందించడం పక్కా అంటూ కొందరు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.మొత్తానికి రాజమౌళి మరియు మహేష్ బాబు సినిమా గురించి ఇష్టానుసారంగా ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారని తెలుస్తుంది.. ఈ సినిమా లో జాన్వీ కపూర్  హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ చిత్రం కోసం కథ ను రెడీ చేస్తున్న విజయేంద్ర ప్రసాద్ అతి త్వరలోనే సినిమా యొక్క స్క్రిప్ట్ ను రాజమౌళి మరియు మహేష్ బాబు కు చెప్పనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: