‘వాల్తేర్ వీరయ్య’ సూపర్ హిట్ అయినప్పటికీ చిరంజీవి మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘భోళా శంకర్’ మూవీ పై చెప్పుకోతగ్గ అంచనాలు రకరకాల కారణాలు ఉన్నాయి. తమిళ మూవీ రీమేక్ గా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ కథలో చాల మార్పులు చేసినప్పటికీ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.


కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈ మూవీలో చిరంజీవి పక్కన తమన్నా నటిస్తూ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ ఏమి బాగుంటుంది అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి. ఆగష్టులో విడుదల కాబోతున్న ఈమూవీ పై ఊహించిన దానికన్నా ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయింది అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ఈమూవీ నిర్మాత అనీల్ సుంకర టెన్షన్ పడుతున్నాడని గాసిప్పులు వస్తున్నాయి.


ఈమూవీ ప్రాజెక్ట్ లో చిరంజీవి భాగస్వామిగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో అనీల్ సుంకర ఈమధ్య చిరంజీవిని కలిసి ఈసినిమాకు ఏర్పడిన ఓవర్ బడ్జెట్ విషయాలను వివరించి మెగా స్టార్ సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫెయిల్యూర్ ట్రాక్ లో కొనసాగుతున్న మెహర్ రమేష్ ఈమూవీ దర్శకుడుగా ఉండటం మెగా అభిమానులకు కూడ కొంత అపనమ్మకాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఈసినిమాకు ఓవర్ బడ్జెట్ సమస్యలు కూడ ఏర్పడితే ఈమూవీ మార్కెటింగ్ విషయంలో సమస్యలు ఏర్పడతాయని అనీల్ సుంకర భయం అని అంటున్నారు.


ఇప్పటికే అనేక భారీ సినిమాలను నిర్మించిన అనీల్ సుంకర తన సినిమాల బడ్జెట్ విషయంలో తరుచూ తప్పటడుగులు వేస్తాడని అంటారు. ఈనెల విడుదల కాబోతున్న అఖిల్ ‘ఏజెంట్’ విషయంలో కూడ ఇలాంటి ఓవర్ బడ్జెట్ సమస్యలు ఎదురు కావడంతో ఆ సినిమాకు కూడ మార్కెటింగ్ సమస్యలు ఏర్పడ్డాయి అని అంటారు. ఇప్పటికే మరి ‘భోళా శంకర్’ మూవీ విషయంలో పెద్దగా క్రేజ్ ఏర్పడని పరిస్థితులలో ఈసినిమాకు సంబంధించిన ఓవర్ బడ్జెట్ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: