టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి నాగార్జున కుమారులు ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. నాగచైతన్య పర్వాలేదు అనిపించుకున్న అఖిల్ మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం చాలానే కష్టపడుతున్నారని చెప్పవచ్చు. తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. మలయాళ నటుడు మమ్ముట్టి కూడా కీలకమైన పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్లో నటించింది.


ఊర్వశి రౌతేలా తో సాంగును విదేశాలలో చిత్రీకరించడం జరిగింది.అయితే.. ఈ పాటలో అఖిల్ ఈమెతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈమెను లైంగికంగా వేధింపులకు గురి చేశారని.. బాలీవుడ్ క్రీటిక్ ఉమైర్ సందు తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ఇక అంతే కాకుండా ఇతనితో నటించడం ఆమె చాలా అసౌకర్యంగా అనిపించింది అంటూ కూడా ట్విట్ చేయడం జరిగింది దీంతో ప్రస్తుతం ఏ ట్వీట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ పాట యూరప్ లో జరిగినట్లుగా తెలియజేయడం జరిగింది. అఖిల్ ఒక పరిపాఖ్యాత లేని నటుడు అని అతనితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అంటూ ఆమె వివరాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఈ విషయం మాత్రం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. అఖిల్ మొదట సిసింద్రీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .ఆ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం జరిగింది ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత హలో మూవీ తో పరవాలేదు అనిపించుకున్న మిస్టర్ మజ్ను సినిమాతో యావరేజ్ హీరోగా పేరు పొందారు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అఖిల్. మరి ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా లేవల్ల హీరోగా పేరు సంపాదిస్తారు లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: