మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. భారీ అంచనాల నడుమ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమాకు విడుదల అయిన అన్ని చోట్లా కూడా బాగా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.ప్రేక్షకుల నుండి విపరీతమైన పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కడంతో పాటు ఈ సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ కూడా నమోదు అవుతున్నాయి. హీరో సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ఒక భారీ కమర్షియల్‌ సక్సెస్ ను విరూపాక్ష సినిమాతో దక్కించుకోబోతున్నాడు అంటూ మొదటి రోజు కలెక్షన్స్‌ ను చూస్తుంటే అనిపిస్తుందని మెగా ఫ్యాన్స్ తో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విరూపాక్ష సినిమాకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్పందిస్తున్నారు. సాయి పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ యాక్సిడెంట్‌ తర్వాత నీకు ఇలాంటి ఒక సూపర్ హిట్ దక్కడం చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.


తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఈ సినిమాపై స్పందించింది. ఈ హర్రర్‌ మూవీని కేవలం నీకోసమే చూశాను బావ... అంటూ ఆమె సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ ను చేసింది. నిహారిక తన పోస్ట్‌ లో.. 'దర్శకుడు, నటీ నటులు, మ్యూజిక్‌, మేకప్ ఇంకా ఆర్ట్‌ వర్క్ సినిమాకు పెద్ద హైలైట్‌. నేను విరూపాక్ష సినిమాని ఉపిరి బిగపట్టుకుని చూశాను. అలాగే మీరు కూడా థియేటర్ కు వెళ్లి ఈ సినిమాను చూడండి. నాలాగే మీరు కూడా మాట్లాడుతారు. చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా కంగ్రాట్స్' అంటూ నిహారిక పేర్కొంది.నిహారిక పోస్ట్‌ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది. మెగా హీరోల సినిమాల గురించి నిహారిక సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మిగతా హీరోల సినిమాలు చూసి కూడా ఆమె రివ్యూలు ఇస్తోంది. నిహారిక ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్ సినిమా విరూపాక్ష గురించి  షేర్ చేయడంతో ఎంతగా ఈ సినిమా ఆమెకు నచ్చిందో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: