టాలీవుడ్ బుట్ట బొమ్మగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్లోనే కాదు నార్త్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ కెరియర్ లో బిజీబిజీగా గడుపుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలం లో స్టార్ హీరోల సినిమాలు అన్నింటికి కూడా ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది అని చెప్పడం  లో అతి శయోక్తి లేదు.


 మొన్నటి వరకు టాలీవుడ్ లో హవా నడిపించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు టాలీవుడ్ లో కాస్త అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పాలి. దీంతో బాలీవుడ్ పై కన్నేసి అక్కడ సెటిల్ అవ్వాలని భావిస్తుంది ఈ సొగసరి. ఈ క్రమం లోనే అక్కడ స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంటుంది అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సరసన కిసికి  భాయ్ కిసికి జాన్ అనే సినిమా లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పూజా హెగ్డే ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో భాగం గా తన కెరీర్ గురించి.. తన సక్సెస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది పూజ హెడ్డే. ప్రస్తుతం తాను అనుభవిస్తున్న సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు అంటూ తెలిపింది. హీరోయిన్గా తన అనుభవాలను గుర్తు చేసుకుంది పూజ హెగ్డే. తొలి రోజుల్లో భాష రాకపోవడం తో ఎంతగానో ఇబ్బంది పడ్డా. సహాయ దర్శకులు డైలాగులను ముందుగా చెబితే.. ఆ తర్వాత నేను మాట్లాడేదాన్ని. ఇటీవలే నేను నటించిన సినిమాలు ఆడక పోవడం తో అవకాశాలు లేక ఏడాది పాటు ఇంట్లోనే ఉన్నా. మళ్ళీ ఛాన్సులు వస్తుండడంతో ఇప్పుడు బిజీ అయ్యాను అంటూ పూజ హెగ్డే తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: