అంతే కాదు ఈ సినిమా కు పార్ట్ 2 ఉంటుందనే విషయాన్నీ కూడా తెలిపాడు సాయి ధరమ్ తేజ్. పార్ట్ 1 లోనే అందుకు హింట్ కూడా ఇచ్చారు. ఇక ఒక అభిమాని సరదాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల రోల్ ని ఎందుకు చంపలేదు అని అడగగా, ఆలా చంపితే నువ్వు ఇలా అడిగావు కదా అంటూ ఫన్నీ గా సమాధానం ఇచ్చాడు. ఇక తమిళ్ లో తనకు ఇష్టమైన దర్శకులు అంటూ మణిరత్నం, లోకేష్ కంగరాజ్, మిత్రన్ పేర్లు చెప్పాడు.
పవన్ కళ్యాణ్ తో నటించబోయే సినిమ టైటిల్ పేరు లీక్ చేయమని ఒక అభిమాని అడగగా, నీదేం పోయింది అప్పుడు నాకు వాచిపోతుంది అంటూ నవ్వులు పూయించారు. పవన్ కళ్యాణ్ తో చేసే చిత్రం కాకుండా మరొక ఫ్యామిలీ డ్రామా లో కూడా నటిస్తున్నట్టు తెలిపాడు సాయి. ఇక మెగా ఫ్యామిలీ వారు కాకుండా తనకు ప్రభాస్ మరియు రవి తేజ అంటే చాలా ఇష్టమని చెప్పిన సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ గురించి మాత్రం తాను ఏమి చెప్పలేనని చెప్పాడు. ఇక పెళ్లి గురించి అడిగితే స్కిప్ చేసిన సాయి తనకు ముద్దపప్పు, ఆవకాయ్ అన్నం అంటే ఇష్టం అని చెప్పాడు. తన కెరీర్ లో రిపబ్లిక్ సినిమాలో అభిరాం పత్రం రిస్కీ అంటూ కూడా చెప్పాడు.