సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. 11 సంవత్సరాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా రానున్న నేపద్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్, త్రివిక్రమ్ మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని త్రివిక్రమ్ విషయంలో మహేష్ బాబు చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే వద్దని మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ వద్దని మహేష్ చెప్పినప్పటికీ త్రివిక్రమ్ తనని కన్విస్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కూడా పలు మార్పులు చేయమని మహేష్ చెప్పిన కూడా త్రివిక్రమ్ వాటిని లైట్ తీసుకున్నట్లు సమాచారం. అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఇలాంటి రూమర్ల పైన చెక్ పెడితే ఒక ట్వీట్ ని షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా మొదటినుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. మహేష్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు ఈ సినిమా ఆలస్యానికి కారణము.. అందుచేతనే ఈ సినిమా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతూ ఉండడంతో ఈ సినిమా పైన రూమర్లు పెరిగిపోయాయి.


నిర్మాత నాగవంశీ ఇలా తెలియజేస్తూ.. ఆకలేసినప్పుడు పిట్టలు గట్టిగా అరుస్తాయి అంటూ సినిమా పైన వస్తున్న వార్తలను ఖండించారు. మహేష్ అభిమానులు అసలు వీటిని నమ్మొద్దు అంటూ తెలిపారు.. సినిమా చాలా బాగా వస్తోంది ..గాసిపులు పట్ల తనేమి కలత చెందలేదని నిర్మాత తెలిపారు. అయినా నిర్మాతకు లేని నొప్పి.. సోకాళ్ళు గాసిప్లు రాయులకు ఎందుకు అంటూ ప్రశ్న ప్రశ్నిస్తున్నారు.. కానీ తమ అభిమాన హీరో సినిమా ఆలస్యమవుతూ ఉంటే అభిమానులలో అనుమానాలు పెరుగుతూ ఉంటాయి కదా ఎవరి గోల వారిది ఈ పిట్ట కథ సంగతి సరే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సంబంధించి ఆల్ ఈజ్ వెల్ అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: