టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా నటిస్తోంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రాశి ఖన్నా. థాంక్యూ సినిమా తర్వాత ఈమె కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలపైన ఎక్కువగా దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో కెరియర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇక్కడ లాభం లేదని తెలుసుకొని ఇతర భాషలను టార్గెట్ చేస్తూ ఉంటోంది. ఈ రకంగా బాలీవుడ్లో తమిళ్లో బాగానే సినిమాల అవకాశాలను అందుకుంటుంది. బాలీవుడ్ లో విడుదలైన యోధ మూవీ మాత్రం ఈమెకు మంచి హిట్టుగా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా కోసం రాశి ఖన్నా అన్ని రకాలుగా సిద్ధపడినట్లు తెలుస్తోంది. రాశికి జోడిగా సిద్ధార్థ మల్హోత్రా నటిస్తూ ఉన్నారు. రాశి తోపాటు దిశ పటానికి కూడా హీరోయిన్గా నటిస్తున్నది. ముఖ్యంగా విమానం హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఇందులో సిద్ధార్థ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హాలీవుడ్ సినిమా తరహాలో హీరో హీరోయిన్ల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు హద్దు మీరే అవకాశం కూడా ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విమానంలో జరిగే ఘటనలు శృంగార సన్నివేశాలలో కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా రాశి ఖన్నా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బెడ్ రూమ్ సన్నివేశాలకు మించి ఇందులో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా రాశి ఖన్నా తనకు పాత్ర నచ్చితే ఎలాంటి సన్నివేశాలలో అయినా నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బెడ్రూం సన్నివేశాలతో పాటు ఎలాంటి నటనతోనైనా మెప్పించగలదు రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ సినిమాలలో రియాల్టీ కోసం మరింత అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే యోధా లో రాశి రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటినుంచే అందరిని ఆసక్తికరంగా పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏ మేరకు రాశి ఖన్నా తో రొమాంటిక్ సన్నివేశాలు వర్కౌట్ అవుతాయి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: